Sunday, March 23, 2025
Homeఆంధ్రప్రదేశ్బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా

బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 22 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బ్యాంకు ఉద్యోగులుతమ డిమాండ్లను నెరవేర్చా లంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ యూఎఫ్‌ బీయూ, సమ్మె చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, యూఎఫ్‌బీయూ, సెంట్రల్ లేబర్ కమిషనర్ మధ్య శుక్రవారం సాయంత్రం సమావేశం జరిగింది. దీనిపై చర్చలు జరిపిన తరువాత రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె నిర్ణయాన్ని యూఎఫ్‌బీయూ వెనక్కి తీసుకుంది. ఐదు రోజుల పనిదినాల డిమాండ్ అమలు విష యాన్ని తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తానని కేంద్ర కార్మిక కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయా లని తాము నిర్ణయించుకు న్నామని పేర్కొంది. తదుపరి రౌండ్ చర్చలు ఏప్రిల్ మూడవ వారంలో జరగనున్నాయి.యూఎఫ్‌బీయూ మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సమ్మె జరిగితే మార్చి 22 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది. ఎందుకంటే మార్చి 23న కూడా బ్యాంకులకు సెలవు దినం ఉంది. సమ్మె జరిగితే దీనివల్ల నగదు లావాదేవీలు, చెక్ క్లియరింగ్, చెల్లింపులు, రుణాల ప్రక్రియ వంటి వాటిపై ప్రభావం పడేది. యూఎఫ్‌బీయూలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ సహా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. ఈ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీ ణ బ్యాంకులలో ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. యూఎఫ్‌బీయూ డిమాండ్లలో ప్రస్తుత ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించడానికి, కస్టమర్ సేవలను మెరుగుపరచ డానికి అన్ని కేడర్లలో సిబ్బం దిని నియమించాలన్న డిమాండ్ కూడా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments