
పయనించే సూర్యుడు జూన్ 11 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలంలో 2007 సంవత్సరం నుండి నడపబడుతున్న పీజీ సెంటర్ నందు 2019- 21 సంవత్సరంలో M.COM విద్యను అభ్యసించిన భాను ప్రనూష కాకతీయ విద్యాలయం ప్రకటించిన 23వ కన్వర్కేషన్లో రెండు గోల్డ్ మెడల్స్ ను సాధించినందున ఆ విద్యార్థిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అభినందించి సత్కారం చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్ అన్నారు.బుధవారం నాడు కళాశాల ఆవరణలో 23 కన్వర్ కేశన్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థినిని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీ కళాశాలలో ఉన్న అన్ని వసతులను విద్యార్థినీలు సద్వినియోగం చేసుకొని కాలేజీకి విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తింపుని సాధించి పెట్టిందని విద్యార్థులకు పీజీ స్థాయిలో అన్ని వసతులు కల్పిస్తున్న ఏజెన్సీలో అతి పెద్ద కళాశాల అని ఏజెన్సీ విద్యార్థులు ఈ భద్రాచలం పిజి సెంటర్ ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ ఇంచార్జ్ హవీలా, అకాడమిక్ కోఆర్డినేటర్ హిమజ, సి ఓ ఈ డాక్టర్ శీను, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.