Sunday, October 26, 2025
Homeఆంధ్రప్రదేశ్భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన

Listen to this article

5 కేజీల బాల భీముడికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జన్మనిచ్చిన తల్లి రాణి

పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్, మరియు వైద్యులుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం అడుగైన ఘటన చోటు చేసుకుంది, మణుగూరు పట్టణానికి చెందిన, జోగునూరు బాబు, అతని భార్య అయిన జోగునూరు రాణి కి పురిటి నొప్పులు రావడంతో, మణుగూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భిణీ స్త్రీ అయిన రాణి కి, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, వెనువెంటనే ఆపరేషన్ నిర్వహించి పండంటి మగ బిడ్డకు కాన్పు చేశారు, పుట్టిన మగ బిడ్డ బరువు చూడగా ఒక్కసారిగా హాస్పటల్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు పుట్టిన మగ బిడ్డ ఐదు కేజీలు ఉండి బాల భీముడులా ఉండటం కాన్పు చేసిన డాక్టర్, మరియు సిబ్బంది, మరియు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు, అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇలాంటి ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగటం ఎంతో ఆనందంగా ఉందని, పేద ప్రజలందరూ ప్రభుత్వ సేవలు వినియోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేపించుకోవాలని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ అన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments