
పహల్గం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది
నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ సంతోషిస్తుంది
దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర
మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు మే 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు జరుగుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. పహాల్గం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని గుర్తుచేశారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరు తో తమదైన శైలిలో దాడులకు పాల్పడడానికి చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, సాయుధ దళాల పోరాటపటిమా దేశ ప్రజలకు గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.