
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో
సి డి ఎం ఏ ఆదేశాల మేరకు వందరోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రాథం చెరువు కట్ట పైన మహిళా సంఘం సభ్యులతో కలిసి చెట్లు నాటడం జరిగింది. వన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలను నాటడం జరిగింది మరియు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ర్యాలీ నిర్వహించడం జరిగింది. చెరువు ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ గోపు గంగాధర్. ఎస్సై మహేష్. ఇందిరమ్మ కమిటీ సభ్యులు. నాయకులు. మున్సిపల్ మేనేజర్ నరేందర్. వార్డ్ ఆఫీసర్లు.మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
