
పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియవర్గంలో భీంగల్ పట్టణంలో
సి.పి నిజామాబాద్ యొక్క ఉత్తర్వుల మేరకు ఏసీబీ ఆర్మూర్ యొక్క ఆధ్వర్యంలో సీఐ భీంగల్, సిఐ ఆర్మూర్, సిఐ ఆర్మూర్ రూరల్, మరియు ఎస్సై భీంగల్ మరియు సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసి భీంగల్ లోని బాపూజీ నగర్ నందు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినారు.ఇట్టి ప్రోగ్రాం నందు ఏ సి పి ఆర్మూర్ పలు సూచనలు చేసినారు రోడ్ సేఫ్టీ గురించి ఏసిపి మాట్లాడుతూ హెల్మెట్ వాడడంపై ఉన్న ప్రయోజనాలు భద్రత మరియు వాహనంకు సంబంధించిన లైసెన్సు ఇన్సూరెన్స్ పర్మిట్లు అన్ని సమకూర్చుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకతలు ఉపయోగాలు తెలుపుతూ యాక్సిడెంట్ అయిన మొదటి గంటలో గోల్డెన్ అవర్ కి సంబంధించిన ప్రయోజనాలు తెలిపినాడు సైబర్ క్రైమ్ గురించి తెలుపుతూ సైబర్ క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి నేరానికి జరిగిన ముఖ్యమైన విషయాలు వాటి నెంబర్ నందు నమోదు చేసుకోగలరని మరియు ఎటువంటి ఆన్లైన్ ఫ్రాడ్ గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతూ ఎవరైనా పిల్లలు డ్రగ్స్ కు బానిస అయినట్లయితే వారి యొక్క తల్లిదండ్రులు గోప్యంగా వారిని తీసుకువచ్చి సంబంధిత పోలీస్ అధికారికి తెలియజేసినట్లయితే అట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీసి డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తులను పట్టుకొని డ్రగ్స్ నిర్మూలనకు గాను తోడ్పడుతాయని తెలియజేసినారు ప్రజల యొక్క భద్రతలో భాగంగా సంబంధిత కాలనీలలో ఎవరైనా అనుమానితులు కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వారి యొక్క పూర్తి వివరాలు లేదంటే వాటి వ్యక్తులకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగలరని కోరుతూ అదేవిధంగా ఇంటి యజమానులు ఎవరైతే కొత్త వ్యక్తులకు వారి ఇంట్లో గదులు కిరాయికి ఇచ్చేవారు ఎవరైతే వ్యక్తులు ఉంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డులు సంబంధిత గుర్తింపు కార్డులు పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే కిరాయిలకు ఇవ్వగలరని తెలిపినారు దొంగతనాలు జరగకుండా సంబంధిత కాలనీలో సీసీ కెమెరాలు ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు సీసీ కెమెరాలు మంజూరు చేసుకోవాల్సిందిగా మరియు కాలనీలో మెయిన్ కూడలిల్లా వద్ద సీసీ కెమెరాలు ఇంస్టాల్ చేసుకోవాల్సిందిగా కోరినారు ఇట్టి కార్యక్రమం నందు 50 నుంచి 100 మంది ప్రజలు హాజరైనారు
