
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ పట్టణం బిజెపి అధ్యక్షుడు కనికరం మధు
భీంగల్ పట్టణంలో మున్సిపల్ పరిపాలనలో భారీ అవినీతి చోటుచేసుకుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించి 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరాలలో పనులకు సంబంధించిన బిల్లులను సమాచార హక్కు చట్ట ఆర్టిఐ ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అవినీతిని బహిర్గతం చేశారు.బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ, నిధులు మంజూరైనా, కొన్ని పనులు పూర్తిగా చేయకపోయినా వాటిని పూర్తయినట్లుగా చూపించి నకిలీ బిల్లులు తయారు చేశారని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు మరియు ఆడిటర్లు కలిసి ఈ అవినీతికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు.”పన్నుల రూపంలో ప్రజల శ్రమ ఫలితంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దోచుకుని మున్సిపల్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు” అని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. “ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ప్రజాధన దోపిడి,” అని వారు అన్నారు.బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని, విజిలెన్స్ మరియు లోకాయుక్త అధికారులను వెంటనే విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అవినీతి పై గళం విప్పాలని, భవిష్యత్లో ఇలాంటి దుస్థితులు తలెత్తకుండా ప్రజా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.అలాగే కొంత మంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ లు గా మరి ఈ వ్యవస్థ ని దుర్వినియోగం చేయడం లో ముఖ్య పాత్ర పోషించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ భీంగల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సమగ్ర విచారణ జరిపించి అవినీతి చేసిన వారిపై కఠిన చర్య తీసుకోకపోతె పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెపడతామణి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు జిల్లా కౌన్సిలర్ మెంబర్ యోగేశ్వర నరసయ్య మరియు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.