
వివరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యం…
రుద్రూర్, జూన్ 06(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ రాజేవ్ గాంధీ హన్మంతు ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగితెలుసుకున్నారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో,తహసీల్దార్ తారాబాయి సదస్సును జూనియర్ అసిస్టెంట్ కోర్వ భూషణ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.