
పయనించే సూర్యుడు// న్యూస్ మే 8//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ .. జాన్ హెన్రీ. డ్యుఏంట్ 8 మే జన్మదినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ను స్థాపించి ఆ రోజున ప్రపంచ రెడ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మక్తల్ లో ని R&B గెస్ట్ హౌస్ లో ఇండియన్ రెడ్ క్రాస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్.హిందిపండిత్ లయన్ కందుకూరి అశోక్ కుమార్ జాన్ హెన్రీ డ్యుయేన్ట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .రెండు దేశాల మధ్య యుద్దాలు జరిగినప్పుడు.ఎంతోమంది సైనికులకు గాయాలతో రక్తం పోయి రక్త హీనత తో బాధపడుతున్న పరిస్థితులను చూసి చలించి పోయారు అప్పుడు ఆయనలో ఒక ఆలోచన వచ్చి తన జన్మ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ను నెలకొల్పరని అన్నారు అదేవిధంగా రక్త దానం మహా దానం రక్త హీనత తో బాధపడుతున్న రోగులకు మరియు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం పోయి కొన ఊపిరితో తల్లడిల్లుతుంటారు వారితో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తులకు అటువంటి సమయంలో రక్తం చాలా అవసరం అన్నా రు అందుకే యువకులు తప్పకుండా ముందుకువచ్చి రక్తదానం చేయాలే మరియు ఇతరులతో చెపించాలన్నారు రక్త దానం చేయడం లో కుల.మత ఆడ మగ. తేడా లేదని ఆరోగ్యండ ఉంటే చాలని ఒకరి రక్త దానం.మరొకరికి ప్రాణ దానం మన శరీరం ఊట బావి లాంటిదని ప్రతి ఒక్కరు ప్రతి 3 నెలలకు ఒక సారి రక్తం ఇవవచ్చన్నారు ప్రతి వ్యక్తి18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చని రక్త దానం చేయడం వలన మన శరీరం లో.పాత రక్త కణాలు పోయి కొత్త రక్త కణాలు వస్తాయని ఆరోగ్యంగా కూడా ఉంటారని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ కందుకూరి అశోక్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్
గోవింద్ రెడ్డి,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.