
పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు “మట్టి గణపతిని పూజిద్దాం -పర్యావరణాన్ని కాపాడుదాం” అని నినాదంతో విజన్ హై స్కూల్ నందు నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం నందు చాలామంది విద్యార్థులు పాల్గొని మట్టి గణపతిని తయారు చేయడం జరిగింది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతతో మెలగాలని విద్యార్థులు ఈ పోటీలలో మట్టి గణపతి తయారు చేసి అందరి ఆకర్షించారు.. కేవలం మట్టి పసుపు, గోధుమ పిండిని ఉపయోగించి ఇటువంటి రసాయనాలు ఉపయోగించకుండా గణపతిని తయారు చేయడం జరిగింది . ఈ మట్టి వినాయక తయారీ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు విజన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ విశ్వనాధ్ బహుమతులను అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది
