
పయనించే సూర్యుడు జూన్ 17( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో చేజర్ల, మడపల్లి రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. ఎస్ .హిమబిందు మాట్లాడుతూ, వరి నారుమడులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలియజేశారు, అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు, పిల్లి పెసర, జనుము, జీలుగా విత్తనా లను రైతుల సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరిచారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అర్హత పొందిన రైతులు, సంబంధిత రైతు సేవా కేంద్రంలో వి ఏ ఏ ఎస్ , విహెచ్ఎఎస్ ల ద్వారా తప్పనిసరిగా ఈ కేవైసీ రెండు రోజులో చేయించుకోవాల్సిందిగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రావి లక్ష్మి నరసారెడ్డి, ఏ ఈ ఓ ఎస్. ఎల్. సుజాత, డివి.సుబ్బారావు, వి ఏ ఏ ఎస్ ఎస్. మమతా, టి మమత, వెటర్నరీ అసిస్టెంట్, మల్లికార్జున రైతులు పాల్గొన్నారు.