
“మత్తు పదార్థాల వల్ల మనిషి జీవితం చిన్న భిన్నం
పయనించే సూర్యుడు జూన్ 27( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మత్తు పదార్థాల వల్ల మనిషి జీవితం చీన్నభిన్నం అవుతుందని తెలిపిన ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల . అక్రమ రవాణా నివారణ దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ ఆధ్వర్యంలోపోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి బ్యానర్లు ఫ్లెక్సీలను చేతబట్టి నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో.ఆత్మకూరు డిఎస్పీ కే. వేణుగోపాల్, సీఐ గంగాధర్, ఏ ఎస్ పేట చేజర్ల ఎస్సైలు, ఎక్సైజ్ శాఖ సిఐ ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యురాలు ఆస్మా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల.చంద్రరెడ్డి, యువనేత పిడికిటి. వెంకటేశ్వర్లు నాయుడు, కౌన్సిలర్ వేణు, స్వచ్ఛంద సంస్థల ఎన్జీవో వాగల. శ్రీహరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు. మాదక దవ్యాలను అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.. మున్సిపల్ బస్టాండ్ వద్ద ర్యాలీలో పాల్గొన్న అందరూ మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.అనంతరం ర్యాలీని ఉద్దేశించి డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడారు మత్తు పదార్థాలు అక్రమ రవాణా అరికట్టేందుకు ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్క జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు