
వరల్డ్ బ్లడ్ డొనేట్ డే ఆత్మకూరులో ర్యాలీ
పయనించే సూర్యుడు జూన్ 15 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు .సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.హాస్పిటల్ సూపర్డెంట్ శేషారత్నం . ఆర్ ఎం ఓ .ఉష సుందరి వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రక్తదానం చేయండి ప్రాణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ జిల్లా వైద్యశాల నుండి ఆర్టీసీ డిపో సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతోందని ముఖ్యంగా ఏమైనా ప్రమాదాల సంభవించిన తరుణంలో గర్భందాల్చిన మహిళలకు ఆపరేషన్ల సమయంలో రక్తదాతలు అందించిన రక్తం ఎంతో ఉపయోగపడుతుందని సూపర్డెంట్ శేషారత్నం తెలిపారు. ఈ ర్యాలీలో అన్ని విభాగాలకు చెందిన వైద్య సిబ్బందితో పాటు శ్రీకృష్ణ సేవా సమితి. సార్డ్ స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా హాజరయ్యారు. రక్తదానం చేయండి మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడండి అంటూ వీరు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
