Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్మయన్మార్ లో ఒక వెయ్యి కి చేరిన మరణాల సంఖ్య

మయన్మార్ లో ఒక వెయ్యి కి చేరిన మరణాల సంఖ్య

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

భారీ భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్ లు అతలాకుతలం అయ్యా యి. పలు ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. ఎటుచూసినా కూలిపో యిన భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా రెండు దేశాల్లో ఇప్పటికే మృతుల సంఖ్య ఒక వెయ్యి కి దాటగా.. 2370 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఒక్క మయన్మార్ లోనే 694 మంది మరణిం చినట్లు ఆ దేశ మిలిటరీ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల్లో ఈ విప్తత్తు కారణంగా మృతుల సంఖ్య పది వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి
భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతల మైన మయన్మార్ లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం తెల్లవారు జామున 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మరోవైపు బ్యాంకాక్ లో భూకంపం కారణంగా పది మంది మరణించగా ఓ భారీ భవనం కూలిన ఘటనలో దాదాపు వంద మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు.మయన్మార్ లో ప్రకృతి వైపరిత్యాన్ని ఎదుర్కోవడానికి ఐక్య రాజ్యసమితి మద్దతును సేకరిస్తోంది.
మయన్మార్, థాయిలాండ్ లలో భూకంప సహాయం, సహాయానికి సింగపూర్ రెడ్ క్రాస్ 150000 డాలర్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చిం ది. ఈ నిధిని ఆహారం, నీరు, దుప్పట్లు, టార్పాలి న్, పరిశుభ్రత వస్తు సామాగ్రి, పలు ముఖ్యమైన వస్తువులను ప్రజలకు అందించేందుకు ఉపయో గించనుంనట్లు తెలిపింది.
ఇప్పటికే భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద మయన్మార్ కు పది హేను టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. సహాయ, రక్షణ కార్యకలాపాల కోసం రష్యా 120 మంది సభ్యుల బృందాన్ని పంపించింది.
అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ముందుకొచ్చాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments