Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్మరి అంత స్వేచ్ఛ మంచిది కాదు

మరి అంత స్వేచ్ఛ మంచిది కాదు

Listen to this article

కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు

షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ యువ నాయకుడు లింగారెడ్డి గూడ అశోక్

షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్వప్రయోజనాల కోసం కనీస విధులను మరుస్తున్నారని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు లింగారెడ్డిగూడెం అశోక్ మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ శాఖలలో పనిచేస్తున్న పలువురు అధికారుల తీరు గర్హహనీయమని అశోక్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యక్రమాలకు సంబంధించి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించిందని అశోక్ వాపోయారు. కొందరు అధికారుల స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అశోక్ విచారం వ్యక్తం చేశారు. ఆయా శాఖల్లోని అధికారులలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధిని చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని దీని వెనుక అతివేచ్చ కూడా ఎక్కువగా ఉందని అశోక్ వివరించారు. అధికారులకు తమ ప్రభుత్వం లో అతి స్వేచ్ఛ ఉందని దీనివల్ల కూడా నష్టం జరుగుతుందని దీనిని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అశోక్ హెచ్చరించారు. ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ గెలిచి ఏడాదిన్నర కావస్తుందని నియోజకవర్గంలో అభివృద్ధిని గణనీయంగా సాధించేందుకు ఎమ్మెల్యే శంకర్ అవలంబిస్తున్న స్వేచ్ఛ విధానం కొంత మెతక వైఖరి చూసి అధికారులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పాలన విషయంలో అధికారులు మారకపోతే ఎమ్మెల్యే సహించబోరని ఇప్పటివరకు కొంతమంది అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛ విషయంలో పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఉందని అశోక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విభాగం సందర్భంగా ఎంపీడీవో బన్సీలాల్ తీరు కూడా ఎంతో బాధ కలిగించిందని, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సిబ్బంది తీరు ఆక్షేపనీయమని అశోక్ పేర్కొన్నారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించాల్సిన అధికారులు కూడా కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని త్వరలోనే అన్నిటికి సమాధానం లభిస్తుందని ప్రభుత్వాన్ని పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పార్టీ తరపున హెచ్చరించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments