Saturday, June 21, 2025
Homeఆంధ్రప్రదేశ్మహిళా హక్కులను చట్టాలను కాపాడుకుందాం

మహిళా హక్కులను చట్టాలను కాపాడుకుందాం

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ జూన్ 21

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా ) చింతూరు మండల 4వ మహాసభ తుమ్మల గ్రామంలో అమరజీవి నారకొండ సోమమ్మా నగర్ అత్యంత ఉత్సాహంగా మహాసభ జరిగింది మహాసభకి ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మహాసభ కి అధ్యక్షత మల్లం సుబ్బమ్మ వహించారు.ఈ మహాసభను ఉద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ పద్మ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా హక్కులను పటిష్టంగా అమలు చేస్తే మహిళలకు రక్షణ కలుగుతుంది. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఈ దాడులు కూడా జరగని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు అనే కామేలు ఇచ్చి ఈరోజు మహిళలను చిన్నచూపు చూస్తుందని అన్నారు. మహిళలకి 1500 ఇస్తానన్న మాట. మర్చిపోయారు ఉచిత బస్సు. తల్లికి వందనం గత ప్రభుత్వం మీకు మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం 15000 ఇస్తానన్న మాట మరిచి 13000 రూపాయలు మాత్రమే అకౌంట్ లో వేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని అన్నారు. మహాసభను ఉద్దేశించి సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ జులై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మహిళలందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొనాలి అని అన్నారు మూడోసారి దేశంలో అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు మహిళా హక్కులను చట్టాలను రక్షించకుండా వ్యవహరిస్తుందని అన్నారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ మాట్లాడుతూ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేసే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి వీడాలి జీవో నెంబర్ త్రీ ని చట్టబద్ధత కల్పించాలి. గిరిజన చట్టాలను కాపాడాలి అని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు సరైన బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయి ఉపాధి హామీ కూలీలకు మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపాధి హామీలను చేసి ప్రభుత్వాలు మీద పోరాటం చేస్తామనిహెచ్చరించారు. అనంతరం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా చింతూరు మండల నాలుగో మహాసభ తుమ్మల గ్రామం జరిగింది ఈ మహాసభలో నూతన కమిటీ 15 మందిని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా నూతన అధ్యక్షులుగా మడివి శ్రీదేవి. నూతన కార్యదర్శిగా బట్ట రాములమ్మ. కోశాధికారిగా ముర్రం రంగమ్మ. సహయ కార్యదర్శులుగా మల్లం సుబ్బమ్మ. పట్రా నాగమణి. సహాయ ఉపాధ్యక్షులుగా సోడి చిన్నమ్మ. కూర శాంతమ్మ. వీరితోపాటు తొమ్మిది మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు. మహిళ నాయకులు ఎంపీటీసీ ముర్రం లక్ష్మి. సోడి కమల. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments