
అవగాహన కల్పిస్తున్న దృశ్యం..
రుద్రూర్, జూన్ 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న, మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితం నాశనం అవుతుందని, వాటి బారిన పడవద్దన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, పోలీస్ శాఖ దీనిపై నిఘా ఉంచిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఏఎన్ ఎం గౌరీ, ఆశ వర్కర్లు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.