
ఐ.టీ.డీ.ఏ పీవో. బి. రాహుల్
పయనించే సూర్యుడు మే 29 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా2025-26 విద్యాసంవత్సరమునకు గాను తెలంగాణ గిరిజన సంక్షేమ మిని గురుకులం బాలికల విద్యాలయములో 1వ తరగతి మరియు 2వ తరగతి, 5వ తరగతిలో మిగిలిన బ్యాకులాగ్ సీట్ల లో ప్రవేశమునకు ధరఖాస్తులు కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మిని గురుకులం బాలికల విద్యాలయము, పినపాక మండలంలో 1వ తరగతిలో ప్రవేశాలకు మరియు 2వ తరగతి, 5వ తరగతులలో మిగిలిన బ్యాకులాగ్ సీట్ల ప్రవేశమునకు అర్హత కల్గిన స్థానిక గిరిజన పినపాక మండలం)విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని మరియు స్థానిక మండల విద్యార్థినులు లేని యెడల సమీప మండలాల విద్యార్థినులకు ప్రవేశమునకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడునని ఆయన అన్నారు. కావున అర్హత గల విద్యార్థినులు వారి యొక్క ధరఖాస్తును ప్రధానోపాద్యాయురాలు, మిని గురుకులం, పినపాక నందు ఈనెల 30వ తేదీ నుండి వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాలని, దరఖాస్తులు చేయడానికి అభ్యర్థి రెండు పాసు పోటో, అభ్యర్థి సంతకం, ఆధార్ కార్డ్. పుట్టిన తేది మరియు మొబైల్ నెంబరును పొందుపర్చలని ఆయన అన్నారు. అట్టి ప్రవేశములకు తరగతుల వారీగా ఖాళీల వివరములు:- 1), 1 వ తరగతిలో – 30 2). 2 వ తరగతిలో 01 3). 5 వ తరగతిలో 08 మొత్తం ఖాళీలు 39 దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయుట జరుగునని మరియు ఇట్టి పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం నందు (CBSE) సిలబస్ లో విద్యాబోధన కలదని, ఒకటవ తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థినిల వయస్సు ఆరు సంవత్సరాలు ఉండాలని ఆయన తెలుపుతూ ఇతర వివరముల కొరకు 9701495907, 7702652708 ఫోన్ నెంబర్లకు సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.