
జనం న్యూస్ జూలై 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో వివిధ సంఘాల బీసీ నాయకులు కలిసి చేసిన పోరాట ఫలితమే అని కోనిగాడుతూ సంబంధిత చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెల్ల హరికృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.