Friday, May 30, 2025
Homeఆంధ్రప్రదేశ్ముగిసిన చింతగట్టు తండా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

ముగిసిన చింతగట్టు తండా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

Listen to this article

క్రీస్తు శేషులు లిభ్య నాయక్ మరియు భాస్కర్ నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

ఫైనల్ విజేతగా మల్లేష్ టీం

( పయనించే సూర్యుడు మే 29 కొత్తూర్ మండల రిపోర్టర్ విస్లావత్ పీరు నాయక్ )

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ పంచాయతీలోని చింతగట్టు తండాలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న చింతగట్టు తండా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. క్రీస్తు శేషులు భాస్కర్ మరియు లిబియా నాయక్ ల పేర్లు మీద నిర్వహించిన టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. టోర్నమెంట్ విజేతలకు నేనావత్ కిషన్ నగదు బహుమతి అందించగా రన్నర్పుకు నేనవత్ మల్లేష్ నగదు బహుమతి అందించడం జరిగింది. ఫైనల్లో నేనావత్ మల్లేష్ టీం గెలిచి ట్రోపీతో పాటు నగదు బహుమతి అందుకోవడం జరిగింది. రెండవ విజేతగా సబావత్ రాజు నాయక్ టీం గెలవడం జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సర్పంచ్ బాలు నాయక్ మాజీ వార్డ్ సభ్యులు రెడ్యా నాయక్, వెంకటయ్య నాయక్,రాజు నాయక్, వెంకట్ నాయక్, గోపాల్ నాయక్,బసు నాయక్ ,పీరు నాయక్ ఆర్గనైజర్ వినోద్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments