
పయనించే సూర్యుడు మే 27 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో, రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రూర్ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు, మరియు భీంగల్ ఏవో లావణ్య , భీంగల్ మండల అధ్యక్షుడుబోదిరే స్వామి, డిసిసి జనరల్ సెక్రెటరీ కుంట రమేష్, పల్లె శేఖర్,పట్టణ అధ్యక్షుడు జె జె నరసయ్య అనంతరావు మల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, ఏం సి డైరెక్టర్లు చిన్నారెడ్డి పోరాడి రాజు, నల్లూరి శీను రాజేశ్వర్ అంజుమ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ చాకలి గంగాధర్, నరేందర్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, వ్యవసాయదారులు రసాయనిక ఎరువులను సాధ్యమైనంత వరకు తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు మల్లాలని, విపరీతమైన పురుగుల మందుల వాడకం మంచిది కాదని దీనివల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి కావున మోతాదుకు మించి పురుగుమందులు వాడకుండా ఉండాలని రైతులకు సూచించారు, రైతుల విత్తనాలు కొనేటప్పుడు తప్పకుండా వ్యాపారుల వద్ద నుంచి రషీదు పొందాలని సూచించారు.
