
పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
పయనించే సూర్యుడు జూన్ 12 (పొనకంటి ఉపేందర్ రావు )
కొత్తగూడెం గురువారం: మైక్రో ఫైనాన్స్ కంబంద హస్తాల్లో చిక్కుకున్న మహిళలకు రుణ మాఫీ చేయాలని , పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గురువారం నాడు జిల్లా కేంద్రంలో మంచికంటి భవన్ లో మహిళా వ్యవసాయ కూలీల జిల్లా సదస్సు శెట్టి వినోద అద్యక్షతన జరిగింది.ఈ సదస్సు లో ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని విమర్శించారు, వ్యవసాయ కూలీలకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ప్రసవ ప్రయోజనాలు కల్పించాలని, వ్యవసాయ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు,జీవన వ్యయం పెరుగుతున్నందున కూలి రేట్లు పెంచాలన్నారు, కమహిళా కూలీల సమస్యల పై రాజీలేని పోరాటాలు ఉద్రృతం చేస్తామని హెచ్చరించారు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో 42.6 శాతం మహిళలు పని చేస్తున్నారని వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు సంబంధించిన వారు 83 శాతం మంది భూమి లేని నిరుపేదలున్నారని తెలిపారు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసనం చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి, ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు, ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు,పోడు భూముల సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శెట్టి వినోద, జిల్లా కమిటీ సభ్యురాలు పద్దం సుగుణ, నాగరత్నమ్మ,సౌభాగ్య, రాజేశ్వరి, దొడ్డ సావిత్రి,జబ్బ సంద్య,నాగదుర్గ, మెస్సు రామకోటమ్మ, భారతమ్మ, జ్యోతి, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.