
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ.పి స్టేట్ డైరెక్టర్ గా షేక్.సల్మా షిరీన్ ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు .ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి .నారా చంద్రబాబు నాయుడు . ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి కి, ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరి గిరినాయుడు కి నెల్లూరు జిల్లా,ఆత్మకూరు నియోజక వర్గ టీడీపీ నాయకులు అందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ భావంతో పని చేస్తున్నందున మాకు పార్టీ అధిష్టానం పదవి బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఆమె తెలిపారు