
పయనించే సూర్యుడు; జూన్ 12:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినెపల్లి గ్రామంలో
జిల్లా కలెక్టర్ దివాకర. టీ.ఎస్. మరియు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆదేశాలతో వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, మొరుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని, మురుమూరు, బిజినేపల్లి గ్రామాలలోఇంటింటి మలేరియా సర్వే. ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించటం జరిగిందనీ పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ జ్ఞనస తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు వర్షాకాలంలో రాబోయే వ్యాధులకు అవగాహన కల్పిస్తూ, నిల్వఉన్న నీరును పారబోసి,పరిసరాల చుట్టూ మురికి కాలవలో తిమోపాస్ చల్లతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజలకు,మలేరియా నిర్ధారణ పరీక్షలు ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయడం జరిగినదని తెలిపారు.ఈయొక్క కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారి జ్ఞానస ఆధ్వర్యంలో బిజినేపల్లి అంగన్వాడి సెంటర్లో వైద్య సిబ్బంది నిర్వహించడం జరిగిందనీ తెలియజేశారు.పరీక్షించుకున్న వారు, ఈయొక్క వైద్య ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న వారు.32మంది కాగా
గర్భవతుల సంఖ్య 2. బాలింతలు మధుమేహం. రక్త పోటు. మరియు ఇతర సమస్యలతో పరీక్షించిన వారి సంఖ్య.32 కార్యక్రమం పాల్గొన్న వారు ప్రగల్లపల్లి పల్లె దవఖానా వైద్యాధికారి జ్ఞానస, హెల్త్ సూపర్వైజర్స్ కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్. శ్రీనివాసరావు ఏఎన్ఎం. కన్యాకుమారి ఆశా కార్యకర్తలు అరుణ. లక్ష్మి. సరిత. రవణమ్మ. అక్కమ్మ. అంగన్వాడి టీచర్. లక్ష్మి మరియుగ్రామస్తులు విద్యార్థులు పాల్గొనడం జరిగిందనీ తెలియజేశారు.
