Wednesday, June 4, 2025
Homeఆంధ్రప్రదేశ్యువతరం పోరు బాణాలై ఉద్యమించాలి 1/70చట్టానికి విరుద్ధం నిర్మించిన గిరిజనేతరులు అక్రమ కట్టడాలను కూడా వెంటనే...

యువతరం పోరు బాణాలై ఉద్యమించాలి 1/70చట్టానికి విరుద్ధం నిర్మించిన గిరిజనేతరులు అక్రమ కట్టడాలను కూడా వెంటనే కూల్చాలి ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 2


చింతూరు ఐటిడిఏ ఎదురుగా ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం సాధనకై ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దిక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి.ఈ దిక్షలలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా పాల్గొని మాట్లాడుతూ ఆదివాసి యువత చెడు మార్గాలను విడనాడి నీ జీవోలు,చట్టాలు,నీ హక్కుల సాధనకొరకు పోరు బాణాల ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆదివాసి ఉద్యోగ నియామక చట్టాన్ని వెంటనే ప్రకటించాలని, మా ఆదివాసి సమాజం యువత చెడు మార్గాలు అయినటువంటి గంజాయి,నక్సలిజం వంటి వాటి వైపుకు వెళ్ళకూడదు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఉద్యోగ నియమక చట్టాన్ని తక్షణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతంలో 1 70 చట్టానికి విరుద్ధంగా అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల పుట్టుకొస్తుంటే రోడ్డు నిర్మాణాల పేరుతో రోడ్డు పక్కన షాపులను కూల్చడం కాదు గిరిజనేతరులు అక్రమగా నిర్మించిన భవంతులు మీకు కనిపించవా?లేక కనిపించిన కళ్ళుండి కబోదుల వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే అక్రమ కట్టడాలను కూల్చకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు స్థానిక అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. 19వ రోజు దీక్షలను చింతూరు మండలం పేగ పంచాయితీ సర్పంచ్ పాయం చంద్రయ్య దీక్షాలను కొమరం భీమ్, బిర్షా ముండా అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నేటి దీక్షలను ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో కుడియం సత్యనారాయణ, తమ్మయ్య, రాము, వెంకయ్య, బొగ్గ బొజ్జి, కొవ్వుసి గంగయ్య, కుంజా సత్యం, మడకం పొద్దయ్య, తోడం సీతారామయ్య, పండా మల్లయ్య,తోడం సుబ్బరాజు, సోడే శ్రీను, కారం సాయిబాబు, ముచ్చిక సుబ్బయ్య, కాక సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments