
ఫుడ్ సైన్స్ కళాశాలలో మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన..
రుద్రూర్, జూన్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాలలో మంగళవారం రుద్రూర్ ఎస్సై సాయన్న, అంగన్వాడి సూపర్వైజర్ శ్రీలత మాదకద్ర వేలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.