
పయనించే సూర్యుడు జూన్ 16 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
మండల కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కి భారీ లభించిందని నిర్వాహకులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదాతలు పాల్గొని తమ విలువైన రక్తాన్ని దానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తల సేమియా పేషెంట్లకు ఉచితంగా , యాక్సిడెంట్ మరియు గర్భవతులకు గవర్నమెంట్ నిర్ణయించిన ధరలకు అందించడం జరుగుతుందని తాడిపత్రి సేవ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు తెలియచేశారు. రక్తదాన శిబిరాన్ని డి.ఆర్.ఓ ఎ.మలోల సందర్శించి ఫౌండేషన్ వారు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని వారి సేవలను కొనియాడడం జరిగింది. అలాగే తాడిపత్రి సేవా బ్లడ్ సెంటర్ నిర్వాహకులను సేకరించిన రక్తాన్ని ఏం చేస్తారు అని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ రక్తదాన శిబిరం నిర్వహించడం ఇది ఐదవ సారి అని, రక్తదానికి శిబిరానికి స్పందిస్తున్న రక్తదాతలు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని రక్తదాతల సహకారంతో అయిదవ సారి కూడా విజయవంతంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని తెలియజేశారు. అలాగే ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు మా ఫౌండేషన్ ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి సేవ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ పెనుగొండ శివకుమార్ నిర్వాహకులు పేరి అశోక్, పేరి విజయకుమార్, సిబ్బంది పేరి పవన్, అశోక్, సాయి, సతీష్,మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు బండారు బాలకృష్ణ, చందగాని దృవ నారాయణ, ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, గాంధీజీ స్కూల్ రామ మోహన్,చింతా నరసింహ, సాయివరపు నాగరాజు, మెటికల చెన్నయ్య, టీ లక్ష్మీకాంతమ్మ, సాయి వరపు నాగరాజు, కావలి సుధాకర్ (వెంకటాంపల్లి)
