Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్రాంభూపాల్,రామకృష్ణ కు కాంగ్రెస్ భవన్ నందు సన్మానం

రాంభూపాల్,రామకృష్ణ కు కాంగ్రెస్ భవన్ నందు సన్మానం

Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర తెలంగాణ నిజాంబాద్ జిల్లా

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్ కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇస్తుంది అనడానికి ఇది నిదర్శనం అన్నారు. పార్టీ నమ్మకంతో మీకు ఈ పదవులు ఇచ్చింది కావున పార్టీ నమ్మకాన్ని కాపాడుతూ పార్టీనీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే విధంగా పనిచేయాలని వారికి సూచించారు.ఈ సందర్భంగా రామ్ భూపాల్,రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాపై నమ్మకం తో ఈ పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,నవాజ్,ప్రీతం,మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,మాజీ కార్పొరేటర్ విజయ,కొండపాక రాజేష్ ,లవంగ ప్రమోద్ మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments