Monday, June 2, 2025
Homeఆంధ్రప్రదేశ్రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

Listen to this article

( పయనించే సూర్యుడు మే 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ప్రజల న్యాయ స్వరాన్ని ప్రజలకు చేర్చే పాత్రికేయులు, వారు ఎదుర్కొంటున్న కష్ట కాలములో ప్రజాప్రతినిధులు వారి పక్షాన నిలవాలి. ఇదే దృక్పథంతో సిటీ కేబుల్ జర్నలిస్ట్ రాకేష్ ఇటీవల తమ తండ్రి ని కోల్పోయిన నేపథ్యంలో, బీజేపీ యువ నాయకుడు, పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బోయ కురుమయ్య కలిసి రాకేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ –“పత్రికా రంగం పునాదులే ప్రజాస్వామ్యానికి బలమైన ధైర్యం అలాంటివారికి మనం తోడు ఉండటం అవసరం ప్రతి నాయకుడి బాధ్యత. రాకేష్ తండ్రి మరణ వార్తను బాధగా స్వీకరిస్తున్నాం. వారి కుటుంబానికి మనస్పూర్తిగా సానుభూతి తెలుపుతున్నాం. బీజేపీ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా నిలబడతాం,” అన్నారు.బీజేపీ నాయకులు ప్రజల్లో, పాత్రికేయల్లో నిలిచే విధంగా మానవీయ విలువలతో, బాధలో భాగస్వాములవుతూ తమ నేస్తం చూపుతున్నారు. ఇది పార్టీకి మానవతా ముఖం ఎలా ఉంటుందో చాటి చెప్పే ఉదాహరణ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments