
(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్)
రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లను వెంటనే పెంచాలి. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము” అని హెచ్చరించారు. కార్యక్రమంలో విహెచ్పిఎస్ ఉపాధ్యక్షులు కుమ్మరి యాదగిరి, ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్, కనకరాజు, బిక్షపతి, పోచయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.