
రుద్రూర్, జులై 23(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తెల్ల గోపి)
రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, తోట సంగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.