
- గోశాలలో ఆవులకు దాన వితరణ…
- గోశాలలో ఆవులకు దాన పంపిణీ చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, జూన్ 19 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని దేవిదాస్ గోశాలలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గోశాలలోని ఆవులకు దాన పెట్టారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో నాలుగు గోశాలలను నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందూర్ కార్తీక్, కర్కే అశోక్, తాటికొండ రవికుమార్, శివశంకర్, వడ్ల నరేష్, కర్కే సాయి లక్ష్మణ్, , రజాక్, గాండ్ల శ్రీనివాస్, ఫుర్ఖాన్, ప్రవీణ్, కాసుల శ్రీనివాస్, కాసుల కార్తీక్, చాకలి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు