Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్రుద్రూర్ లో తెలంగాణ జాగృతి యువజన సమైఖ్యా సమావేశం…

రుద్రూర్ లో తెలంగాణ జాగృతి యువజన సమైఖ్యా సమావేశం…

Listen to this article

సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం…

రుద్రూర్, జూన్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య సమావేశాన్ని శుక్రవారం మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఉదృతంగా పోరాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పటివరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు. అన్ని వర్గాల కోసం పోరాడే నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అని ఆయన వివరించారు. బీసిలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీలతో ఏకైమై జూలై 17 వ తేదీన పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ రైల్ రోకో కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా జాగృతి కార్యదర్శి భరద్వాజ్, బీసీ సంఘం నాయకులు దర్శనం దేవేందర్, చంద్రకాంత్, బోధన్ జాగృతి కన్వీనర్ హరీ, నరేష్, వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్, పున్న పురుగయ్య, పోచయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments