
మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై సాయన్న..
రుద్రూర్, జూన్ 19 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ, సదస్సు, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.