Tuesday, August 5, 2025
Homeఆంధ్రప్రదేశ్రేషన్ బియ్యం బొలెరో వాహనంతో సహా సీజ్ కేసు నమోదు

రేషన్ బియ్యం బొలెరో వాహనంతో సహా సీజ్ కేసు నమోదు

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 05/08/25


32 క్వింటల్ల రేషన్ బియ్యం బొలెరో వాహనంతో సహా సీజ్ కేసు నమోదు ప్రభుత్వము పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న వారిపై గాంధారి సబ్ ఇన్స్పెక్టర్ బి.ఆంజనేయులు నిఘా పెంచి గౌరారం గ్రామం నందు బొలెరో వాహనం లో రవాణా చేస్తుండగా కోటగిరి గ్రామానికి చెందిన బొలెరో వాహనం నడుపుతున్న మహమ్మద్ ఉమేర్ అదుపులోకి తీసుకొని అతనితో పాటు వివిధ గ్రామాల్లో నుండి రేషన్ బియ్యాన్ని కొనుక్కొని వేరే రాష్ట్రాలకు రవాణా చేస్తున్న తాడ్కోల్ గ్రామం బాన్సువాడ చెందిన అందె మనోహర్ ను అదుపులోకి తీసుకొని బొలెరో వాహనంలో గల దాదాపు 32 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ బియ్యం బొలెరో వాహనం నెంబర్ TS 16UB4583 గల దానిలో అక్రమంగా తరలిస్తుండగా గాంధారి ఎస్ఐ పట్టుకుని బొలెరో వాహనాన్ని దానిలో ఉన్న పీడీఎస్ రేషన్ బియ్యం ని మరియు బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులకు పీడీఎస్ రేషన్ బియ్యం అప్పగించినారు,
ఈ సందర్భంగా ఎస్ఐ మండలంలో ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరియు మండలంలో అసాంఘిక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments