
పయనించి సూర్యుడు// న్యూస్ మే 31//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
మక్తల్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మద్దతు ధర పెంచుతూ అన్నదాతలు పండించిన 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటినుండి ప్రభుత్వం రైతులు ఉపయోగించే ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ, అదేవిధంగా అర్హత గల ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధిని రెగ్యులర్గా రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ రైతు పక్షపాతిగా కొనసాగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో మాగనూరు మండలం మాజీ అధ్యక్షులు జయానంద్ రెడ్డి ప్రస్తుత ఉమ్మడి మండల అధ్యక్షులు నల్లే నర్శప్ప మక్తల్ మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కనకరాజు జిల్లా కౌన్సిల్ సభ్యులు ,వాకిటి మల్లేష్ ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, సర్పంచ్ కరిమని తిమ్మప్ప భారత కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు కవలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
