
పయనించే సూర్యుడు జూన్ 16 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : మండలంలోని ప్రేగల్లపాడు, బోడ్, ముత్యలం పాడు క్రాస్ రోడ్డు రైతువేదిక ల నుండి రైతులు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం1031రైతువేదిక లకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమం ను ప్రత్యక్షంగా వీక్షించడం జరిగినది అలాగే రైతు భరోసా కింద రాష్ట్ర రైతులందరికీ అన్ని ఎకరాలకు ఈ రోజు రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు సందేశం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్.అన్నపూర్ణ, హార్టికల్చర్ ఆఫీసర్ స్రవంతి, ఏఇ కన్నయ్య ఈ ఓ లు ప్రవీణ్, శ్రావణి, భాగ్యశ్రీ , రమేష్, రెహానా సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ , మార్కెట్ డైరెక్టర్ జార సమ్మక్క, రైతులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు బయోచార్ కంపోస్టు మునగ చారు కాంపౌండ్స్ గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది