Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్రైతు నేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి....

రైతు నేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 14 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నెల 16 సోమవారం జరుగు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని, ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. సోమవారం నిర్వహించి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడునున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతువేదికలలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సోమవారం అన్ని రైతు వేదికలను పండుగ వాతావరణం లో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకే రైతు వేదిక వద్దకు రైతులు చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆడియో మరియు వీడియోలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సరిచూసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే రేపటిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికలకు విచ్చేసే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలను పలకాలని అధికారులకు సూచించారు. ప్రతి రైతు వేదికలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఎంత మంది రైతులకు ఎంత మొత్తంలో రైతు భరోసా జమ అవుతున్నదో వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతు వేదికలకు పెద్ద ఎత్తున రైతులు హాజరవుతారు కాబట్టి, రైతు వేదికల వెలుపల ఏబిసిడి డ్రైవ్ పై అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదిక పరిధిలో మునగ సాగు చేపట్టి లబ్ధి చేకూరిన రైతులను ఆహ్వానించి వారి ద్వారా ఇతర రైతులకు మునగ సాగు ద్వారా వచ్చే లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీఎంలు కూడా హాజరు కావాలని, దాని ద్వారా వారు మహిళా సమైక్య సభ్యులకు అజోల్ల పెంపకం, బయోచార్ తయారీ, చేపల పెంపకం తదితర వాటిపై సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని కలెక్టర్ సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో దేశం మొత్తం జిల్లా వైపు చూస్తుందని దీనికి సహకరించిన ప్రతి అధికారి, ఉద్యోగస్తులను కలెక్టర్ అభినందించారు. రానున్న వర్షాకాలంలో ఎక్కడైతే వర్షం నీరు నిలుస్తుందో అక్కడ వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments