
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
మంగళవారం రోజున భీంగల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా.. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే కి, సోనియాగాంధీ గాంధీ కి, రాహుల్ గాంధీ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి రాష్ట్ర మంత్రి వర్గానికి అందరికి భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది గతంలో ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించడం జరిగింది 16వ తేదీన ఈ నిధుల విడుదల ప్రారంభించాం.. ఈరోజు కు 100 శాతం వ్యవసాయ భూములను భరోసా నిధుల విడుదల పూర్తి చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని నిరూపించింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అనంతరావు,జిల్లా కార్యదర్శి బొజ గౌడ్, యువజన కాంగ్రెస్ అవినాష్, మహేష్,సురేష్,రాగుల మెహన్,శ్రీను,భుమేష, బాద్రి,నితిన్,శ్రీకాంత్,సతిష్,గొపాల్,సేవలల్,నారాయణ, సాయిలు,సూపర్ గౌడ్,కృష్ణ, రవి,కలీం,జుబేర్,అజార్,గంగ బాపు,సత్యనారాయణ,గంగారం,భాస్కర్,మురారి,జేమ్స్,రాజేశ్వర్,పృథ్వీరాజ్,సాగర్,శివ, దినేష్,రాము,నరేందర్,బలరాం,గంగాధర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు
