Wednesday, June 11, 2025
Homeఆంధ్రప్రదేశ్రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతకు పంటలపై అవగాహన కార్యక్రమం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతకు పంటలపై అవగాహన కార్యక్రమం

Listen to this article

రైతులు యూరియా అధిక వాడకం తగ్గించాలి

కె. వి. కే శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ కుమార్

పయనించే సూర్యుడు మే 16 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామపంచాయతీలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతకు పంటలపై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి కొత్తగూడం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్ కుమార్ శ్రీనివాసరావు ఇల్లందు ఏడిఏ లాల్చంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతులు లోతు దుక్కులు దున్నటం వల్ల కీటకాలు నశిస్తాయని తెలిపారు పంటలు వేశాక అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు ఎక్కువ ఖర్చు వస్తుందని యూరియా వాడకం తగ్గించాలని అన్నారు అలాగే తొలకరిలో పచ్చి రొట్టె సాగు చేసి కలియదుండటం వల్ల పంటలలో కార్బన్ శాతం పెరిగి భూమి ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు వాణిజ్య పంటలైన పత్తి మిర్చి మొక్కజొన్న. బదులు అపరాల పంటలైన పెసర మినుము కంది సాగుతో భూసారం పెరుగుతుందన్నారు ఆయిల్ ఫామ్ మునగ వెదురు సాగు వల్ల రైతులు మంచి లాభాలు సాధించవచ్చు అని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏవో అన్నపూర్ణ ఏఈవోలు శ్రావణి ప్రవీణ్ రమేష్ భాగ్యశ్రీ రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments