Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల క్లెయిమ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల క్లెయిమ్

Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ,IPS

టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత భద్రత

సతీష్ జక్కుల,టాటా ఏ ఐ ఏ కొత్తగూడెం బ్రాంచ్ మేనేజర్

పయనించే సూర్యుడు జూన్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పోలీస్ కానిస్టేబుల్ తన్నీరు అనిల్ కుమార్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో పడింది. పోలీస్ కానిస్టేబుల్ అనిల్ పాల్వంచ డిఎస్పి ఆఫీస్ నందు కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహించేవారు.అయితే ముందుగా తీసుకున్న టాటా ఏ ఐ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థికంగా భారీ భద్రత లభించింది. పోలీస్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సెప్టెంబర్ 2022న టాటా ఏ ఐ ఏ ద్వారా వార్షిక ప్రీమియంగా రూ.28,761/- చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నారు.13 డిసెంబర్ 2024న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.ఆయన నామినీగా ఉన్న తన్నీరు నాగలక్ష్మి జనవరి 8న క్లెయిమ్ ప్రక్రియ కొత్తగూడెం బ్రాంచ్ నందు ప్రారంభించారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం మార్చి 28, 2025న క్లెయిమ్ మొత్తం రూ.1,00,00,000/- (ఒక కోటి)వారి ఖాతాలోకి జమ చేయబడింది. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాలలోనే అనుకోని రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులను నామిని అయినటువంటి తన్నీరు నాగలక్ష్మి గారి అకౌంట్లో జమ చేయడం జరిగింది.టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగూడెం బ్రాంచ్ మేనేజర్ సతీష్ జక్కుల ఒక సాధారణ ప్రీమియంతో అకాల మరణంలో కుటుంబానికి కోట్లలో భద్రత అందేలా టర్మ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది అని అన్నారు. ప్రతి కుటుంబ నేత జీవిత భద్రతకు ఈ కాలంలో టర్మ్ బీమా తప్పనిసరి.ఈ ఉదాహరణ పాలసీ తీసుకున్న మూడేళ్లలో ఆక్సిడెంట్ ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల బీమా ఇవ్వడం జరిగింది, మీకు బీమా విషయంలో ఎలాంటి అపోహలు ఉన్న తొలగించడానికి మేము రెడీగా ఉన్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఎంప్లాయీస్ రాహుల్ వెంకటేష్,లీడర్స్ తానికొండ నాగేంద్ర రెడ్డి, కొచ్చెర్ల కమలరాణి, భూక్యా తారాప్రసాద్, దేవునూరి శివప్రసాద్,కొర్ర రాములు,ఆనంద్ వర్ధన్,అనిల్ శివలీల,జాడి సుమన్,నాగలక్ష్మి,పావనిమహేష్ పాల్గొన్నారు. టర్మ్ పాలసీ గురించి అవగాహన పెంచేలా ఈ ఉదాహరణ నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments