Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్వనం -మనం -మన గ్రామాలలో ప్రతి ఒకరు మొక్కలు నాట్టాలి అది మనందరి భాద్యత

వనం -మనం -మన గ్రామాలలో ప్రతి ఒకరు మొక్కలు నాట్టాలి అది మనందరి భాద్యత

Listen to this article

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 5చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి

చింతూరు మండలం చిడుమూరు గ్రామపంచాయతీ లో ఈరోజు పంచాయతీ ఆవరణలో చిడుమూరు పంచాయతీ సర్పంచ్ కాక అరుణకుమారి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు,అనంతరంకార్యక్రమానికి ముందు ప్రతిజ్ఞ చేసి మొక్క నాటడం జరిగింది. అలాగే ఈరోజు ర్యక్రమమును ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ ఒక మొక్కను నాటితే స్వచ్ఛమైన ఆరోగ్యం ఆక్సిజన్ సమతుల్యత కాపాడుతూ మానవజాతికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని వివరించారు, ప్రతి ఒక్కరు వనరులను కాపాడాలని తాద్వారా ఆ వనరులను పెంచి ప్రకృతిని కాపాడాలని మాట్లాడటం జరిగింది.చిడుమూరు పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ రాబోయే బావితరానభవిష్యత్తులో వనరులు వన్యప్రాణులను కాపాడాలంటూ ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటండి మన ప్రకృతిని మనమే కాపాడాలని, మనకి బ్రతుకు నిచ్చేది మనకి నీడని ఇచ్చేది మనకి గాలి ఇచ్చేది చెట్టే అని అన్నారు, అలాగే జీవకోటిని కాపాడేది చెట్టు కనీసం ఒక్క మొక్క నాటి నాటిన మొక్క చెట్టుగా మారేవరకు పెంచి చెట్టును కాపాడితే అది మనని కాపాడుతుంది. రాబోయే తరానికి జీవ వాయువు అవుతుందని ఆయన వివరించారు. ఈనాటి కార్యక్రమానికి చిడుమూరు పంచాయతీ సెక్రెటరీ సోడే అభిలాష్ , పంచాయితీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కొర్స రాంబాబు, పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ సోడే కమలాక్షి, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, పరిశుభ్రత కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments