Sunday, August 3, 2025
Homeఆంధ్రప్రదేశ్విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు రైల్వే స్టేషన్‌ విద్యా యాత్ర

విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు రైల్వే స్టేషన్‌ విద్యా యాత్ర

Listen to this article

( పయనించే సూర్యుడు ఆగస్టు 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగా రెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పాలాపల్లిలోని విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఈరోజు విద్యాయాత్ర నిర్వహించారు. షాద్ నగర్ లోని రైల్వే స్టేషన్‌కు 5 మరియు 6 తరగతి విద్యార్థుల కోసం ఈ విద్యా యాత్రను నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ వెంకట్ కృష్ణ తెలిపారు.ఈ సందర్శన విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది. మరియు రవాణా మరియు దేశ అభివృద్ధిలో రైల్వేల ప్రాముఖ్యతపై వారికి అవగాహనను కల్పించడం జరిగిందన్నారు.రవాణా సౌకర్యాలు మరియు రైల్వే స్టేషన్ ఎలా పనిచేస్తుందనే దానిపై విద్యార్థులకు వివరించడం జరిగింది. అంతేకాకుండా రైల్వే కార్యకలాపాలు మరియు సిబ్బంది పాత్రల గురించి వివరించడం జరిగింది. రైల్వే భద్రతా చర్యలు మరియు ప్రయాణీకుల సౌకర్యాల పరిశీలన యాత్ర వివరాలు గురించి వివరించడం జరిగింది. సందర్శన సమయంలో, విద్యార్థులు వివిధ రకాల రైళ్లు (ప్రయాణీకులు మరియు సరుకు రవాణా) రైలు సూచికలు మరియు ప్రకటనలు.వేచి ఉండే గదులు మరియు ప్లాట్‌ఫారమ్‌లు.స్టేషన్ మాస్టర్లు, గార్డులు మరియు టికెట్ ఎగ్జామినర్లు సహా రైల్వే సిబ్బంది యొక్క విధులను తెలుసుకోవడం జరిగింది. రైల్వే స్టేషన్‌లో మరియు రైలులో ప్రయాణించేటప్పుడు భద్రతా నియమాలు కూడా వివరించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments