Saturday, August 2, 2025
Homeఆంధ్రప్రదేశ్విఐపి పాఠశాల ఆధ్వర్యంలో వన్ డే కిసాన్ కార్యక్రమం

విఐపి పాఠశాల ఆధ్వర్యంలో వన్ డే కిసాన్ కార్యక్రమం

Listen to this article

గ్రామీణ ప్రాంత మరియు వ్యవసాయ రంగంపై ప్రత్యేక అనుభవం

విద్యార్థులకు ఆచరణాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడమే లక్ష్యం

ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణ

( పయనించే సూర్యుడు ఆగస్టు 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి లోని విఐపి పాఠశాలలో ఈ రోజు “వన్ డే కిసాన్” అనే కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణ మీడియాకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల జీవితం మరియు వ్యవసాయం గురించి స్వయంగా అనుభవాలను విద్యార్థులకు తెలియజేయడానికి మరియు స్వయంగా అనుభవాలు కలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఆచరణాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడమే లక్ష్యం అన్ని ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 నుండి 9 తరగతి చదువుతున్న విద్యార్థులు మరియు పి ఈ టి రాజన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments