Saturday, June 14, 2025
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ…

విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ…

Listen to this article

పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేస్తున్న దృశ్యం..

రుద్రూర్, మే 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):

రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 2000-2001 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు పెన్నులు, అట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా నాగమణి – తాజా బాబు రుద్రూర్ రైడ్స్ సలహాదురులు, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, రుద్రూర్ మండల విద్యాశాఖ అధికారి కట్టా శ్రీనివాస్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు ఆల్ఫాహారాన్ని అందించారు. ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకోవాలని, చదువుతోనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణప్రసాద్, కార్యదర్శి పార్వతి శేఖర్, కోశాధికారి చిదుర మహిపాల్ గుప్తా, సలహాదారులు బెజుగం వెంకటేశం గుప్తా, సభ్యులు లోగం సురేష్, ఈరపురం సాయిలు, పార్వతి ప్రవీణ్ (కిరాణా) సాదుల ప్రవీణ్, పుట్టి సాయిబాబా, బొరె రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments