
పయనించే సూర్యుడు జూన్ 21( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం మడపల్లి గ్రామపంచాయతీలో జువ్వుకుంట వెంకయ్య స్థానిక గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి ప్రాథమిక పాఠశాలలో తన సొంత ఖర్చులతో ఒక వాలంటరీ ఏర్పాటుచేసి విద్యార్థి విద్యార్థుల కొరకు చదువు చెప్పించడమే కాకుండా ఉచితంగా ట్యూషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్లందరికీ అనేక బహుమతులు ఇస్తూ చదువు పట్ల పిల్లలకు ఆసక్తి పెంచేలా కృషి చేస్తున్నారు ఆ క్రమంలో గత విద్యా సంవత్సరం 2024. 25 వ సంవత్సరానికి ముగ్గురు విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు ఈ నేపథ్యంలో శనివారం విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేకంగా అభినందించి జువ్వ గుంట బాబు ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఐ . వెంకయ్య ద్వారా భారత్ మహాసేన వ్యవస్థాప క అధ్యక్షులు విద్యార్థి విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నగదు రూపంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు