
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 12
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతూరు నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాల ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు బ్యాగ్,నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ యూనిఫామ్, డిక్షనరీ తో కూడిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఐటిడిఎ చింతూరు ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ IAS గారు పాల్గొని విద్యార్ధులతో ముచ్చటించి NCERT పాఠ్యపుస్తకాల ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ జి.వెంకటేశ్వర్లు పాఠశాల SMC చైర్మన్ శ్రీ ఆకుల వరప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మందేశ్వర రావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్ధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
