
( పయనించే సూర్యుడు మే 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లోని కొందుర్గు మండల కేంద్రం లో ప్రదర్శిస్తున్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీధినాటకం కోసం కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఇరవై ఐదు వేల రూపాయలను (Rs. 25,000/-)నిర్వాహకులకు విరాళంగా ఇవ్వడం జరిగింది. దీంతో మీరు నిర్వాహకులు రాజేష్ పటేల్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజేష్ పటేల్ మాట్లాడుతూ… విధి నాటకాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రాచీన కళలను రాబోయే తరాలకు అందించాలని మరియు మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో
గోపాల్, సున్నాల శ్రీనివాస్, జగన్ గౌడ్, వెంకటేష్, అనిల్, వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు.
