
పయనించే సూర్యుడు జూన్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మంత్రి ఆనం రాకతో పులకించిన వీర్లగుడిపాడు గ్రామం మారుమూల పల్లెలో ప్రతి గడపలోనూ మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు, నాయకులు. వీర్లగుడిపాడు గ్రామపంచాయతీ నందు సిమెంట్ రోడ్డును ప్రారంభించిన మంత్రి వీర్ల గుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం వీర్ల గుడిపాడు గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది మారుమూల గ్రామమైన వీర్ల గుడిపాడు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం గ్రామంలోని రోడ్లన్నిటిని కూడా సిమెంట్ రోడ్లుగా మార్చేందుకు చర్యలు చేపట్టాం వీర్ల గుడిపాడు నుంచి జాతీయ రహదారికి అనుసంధానిస్తూ రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణానికి రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు ఏడు కిలోమీటర్ల మేర తారురోడ్డు, 150 మీటర్ల పొడవు బ్రిడ్జి నిర్మించేలా అధికారులు ప్లాన్ రూపొందించారు మంత్రి ఆనం త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులకు ఆమోదం తీసుకుని, పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటాం మంత్రి రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణంతో వీర్లగుడిపాడు గ్రామం నుంచి నేరుగా సంగం కు చేరుకునేలా రాకపోకలు సులభతరమవుతాయి గ్రామానికి కనెక్టివిటీ పెరుగుతుంది తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
