Thursday, June 5, 2025
Homeఆంధ్రప్రదేశ్వెన్నుపోటు దినం కార్యక్రమం ప్రజలు విజయవంతం చేయండి మండల కన్వీనర్

వెన్నుపోటు దినం కార్యక్రమం ప్రజలు విజయవంతం చేయండి మండల కన్వీనర్

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి, ప్రకటించిన పధకాలను అటకెక్కించి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వ విదానానికి నిరసన వ్యక్తం చేద్దాం
ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి, గెలిచిన తర్వాత పధకాలను అమలు చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 04 న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
జననన్న పిలుపు మేరకు మన నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ప్రియతమ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆద్వర్యం లో జూన్ 04 బుదవారం ఉదయం 10 గంటలకి జరిగే నిరసన కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించడం‌ జరుగుతుంది. చేజర్ల మండలం చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంస్థల సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.ప్రజల తరపున పోరాడుదాం ప్రజల గొంతుకై ప్రతిద్వనిద్దాం ఈ కార్యక్రమానికి ప్రజలు మండల నాయకులు. కార్యకర్తలు. అభిమానులు యువకులు. తరలివచ్చి విజయవంతం చేయాలని మండల కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి మంగళవారం తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments